ఘోర ప్రమాదం... రోడ్డుపైనే రెండు కార్లు దగ్ధం

Update: 2019-10-22 06:30 GMT

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ కు వెల్తున్న కారు డివైడరును ఢీ కొట్టి అవతలి నుంచి వస్తున్న మరో కారును డీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లలో భారీగా మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నలుగురికి చికిత్స నిమిత్తం పోలీసులు కోదాడలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News