నిజామాబాద్ జిల్లా ముఫ్కాల్ మండలం కొత్తపల్లి శివారులో అగ్ని ప్రమాదం సంభవించింది. పుసుపు లోడ్తో వెళ్తున్న లారీకి మంటలు అంటుకున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో లారీ కాలి బూడిదయ్యింది. లారీ డీజిల్ ట్యాంక్ లీక్ కావడంతో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. వెల్కటూర్ నుంచి నిజామాబాద్ మార్కెట్కు పసుపు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 50 లక్షల మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. లారీలో ఉన్న డ్రైవర్ సుధాకర్, క్లీనర్ అజయ్ కూడా మంటలు తాకి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.