Hyderabad: సిటీ బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్
Hyderabad: ఇప్పటికే ఆరు బస్సుల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన అధికారులు
Hyderabad: సిటీ బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్
Hyderabad: గ్రేటర్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. మహాలక్ష్మీ పథకంతో బస్సుల్లో రద్దీ అమాంతం పెరిగింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త బస్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ఎక్కువ మంది ప్రయాణించేలా మెట్రో తరహా సీటింగ్ను రెడీ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆరు బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్ను సిద్ధం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులలో కూడా మెట్రో సీటింగ్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.