Road Accident: హస్తినాపురంలో కారు బీభత్సం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

Road Accident: హైదరాబాద్‌లోని హస్తినాపురంలో మద్యం మత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించిన డ్రైవర్.

Update: 2026-04-08 05:20 GMT

Road Accident: హస్తినాపురంలో కారు బీభత్సం.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

Road Accident: హైదరాబాద్ నగరంలోని హస్తినాపురంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని, బైక్ పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకులిద్దరూ మృతి చెందారు. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతి చెందిన యువకులిద్దరూ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు శివ, సందీప్ జోహెల్‌గా పోలీసులు గుర్తించారు.

శివ,సందీప్ జోహల్ మృతికి కారు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ తోటి కాలేజీ విద్యార్థులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని తమకు అప్పగించాలని విద్యార్థుల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా నిందుతుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News