Etela Rajender: ఈటెల భూకబ్జా కేసు విచారణ వేగవంతం

* మాసాయిపేట మండలంలో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలు * జమున హ్యాచరీస్‌కు జూన్‌లోనే నోటీసులు జారీ

Update: 2021-11-08 08:35 GMT

ఈటల భూకబ్జా కేసు విచారణ వేగవంతం(ఫైల్ ఫోటో)

Etela Rajender: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ భూకబ్జా కేసు విచారణ వేగవంతం చేశారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్లు ఈటల కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి.

దీనికి సంబంధించి జమున హ్యాచరీస్‌కు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే గతంలో నోటీసులు జారీ చేసింది. అయితే కోవిడ్‌ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితులు కాస్త చక్కబడటంతో హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 16న పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది.

Full View


Tags:    

Similar News