తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఇవాళ మధ్యాహ్నం కూకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్లో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే మూడు నుంచి తొమ్మిది వరకు 94 కేంద్రాల్లో ఆన్లైన్ ఎంసెట్-2019 పరీక్ష నిర్వహించారు. ఇందుకు ఇంజినీరింగ్ విభాగంలో 1.42 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 74,981 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ వెయిటేజ్తో ఫలితాలు ఆలస్యం కావడంతో ఎంసెట్ ఫలితాల విడుదల ఆలస్యం అయిందని ఎంసెట్ కన్వీనర్ యాదయ్య తెలపారు. ఫస్ట్ ర్యాంక్-కె. రవిశ్రీతేజ (తాడేపల్లిగూడెం), రెండో ర్యాంక్-డి.చంద్రశేఖర్ (హైదరాబాద్), మూడో ర్యాంక్-ఆకాష్రెడ్డి(హైదరాబాద్), నాలుగో ర్యాంక్-కార్తికేయ (హైదరాబాద్) సాధించారు.