దుబ్బాకలో టీఆర్ఎస్‌దే గెలుపు : ఆరా సంస్థ

దుబ్బాక ఉపఎన్నికలో గులాబీ గెలుపు ఖాయమని ఆరా అనే సర్వే సంస్థ అంచనా వేస్తోంది. హోరాహోరీ జరిగిన ఉప పోరులో అధికార పార్టీ అందలమెక్కనుందని ఆరా సంస్థ వెల్లడించింది.

Update: 2020-11-07 12:42 GMT

దుబ్బాక ఉపఎన్నికలో గులాబీ గెలుపు ఖాయమని ఆరా అనే సర్వే సంస్థ అంచనా వేస్తోంది. హోరాహోరీ జరిగిన ఉప పోరులో అధికార పార్టీ అందలమెక్కనుందని ఆరా సంస్థ వెల్లడించింది. ఇక బీజేపీ సెకండ్ ప్లేస్‌లో నిలుస్తుందని ఆరా సంస్థ గట్టిగా చెబుతుంది. ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు 48.72శాతం, బీజేపీకి 44.64శాతం ఓట్లు నమోదైనట్లు ఆరా సంస్థ చెబుతోంది. ఇక కాంగ్రెస్‌కు 6.12శాతం, ఇతరులకు 2.52శాతం ఓట్లు నమోదైనట్లు ఆరా సంస్థ తన సర్వే ద్వారా అంచనా వేస్తోంది.  

Tags:    

Similar News