హుజూర్నగర్లో పాగా వేసే లక్ష్యంతో టీఆర్ఎస్ పక్కా ప్రణాళిక రూపొందించింది. గడప గడపకూ ప్రచారం పేరుతో 9 మండలాలకు ఐదుగురు చొప్పున ఇంచార్జీలను సీఎం కేసీఆర్ నియమించారు. ఉమ్మడి నల్డొండతో పాటు.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దాదాపు 50 మంది నేతలను ఇంచార్జీలుగా నియమించారు. ప్రతీ మండలంలోనూ మంత్రులు రోడ్డు షోలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. వచ్చే నెల 17 లేదా 18 న బహిరంగ సభలో కేసీఆర్ హాజరవుతారని చెబుతున్నారు.