MLC Elections: నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ పోరులో టీఆర్ఎస్ ఆధిక్యం

MLC Elections 2021: పల్లా రాజేశ్వర్ రెడ్డికి-1,22,639 ఓట్లు * తీన్మార్ మల్లన్నకు 99,207 ఓట్లు * కోదండరాంకు 89,407 ఓట్లు

Update: 2021-03-20 08:32 GMT
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు (ఫైల్ ఇమేజ్)

MLC Elections 2021: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 68 మంది అభ్యర్ధులు ఎలిమినేషన్ అయ్యారు. బీజేపీ అభ్యర్ధి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎలిమినేషన్‌ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు జమ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఒక లక్షా 22 వేల 639 ఓట్లు పోలయ్యాయి. తీన్మార్ మల్లన్నకు 99,207 ఓట్లు, కోదండరాంకు 89,407 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి 23 వేల 432 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Tags:    

Similar News