Nizamabad: మహా శివరాత్రి రోజు విషాదం.. కాలువలో స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతు
Nizamabad: ఎస్సార్ఎస్పీ లక్ష్మీ కాలువలో స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతు
Nizamabad: మహా శివరాత్రి రోజు విషాదం.. కాలువలో స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతు
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో మహా శివరాత్రి రోజు విషాదం చోటుచేసుకుంది. ఎస్సార్ఎస్పీ లక్ష్మీ కాలువలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైనవారు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం గన్యాతాండకు చెందినవారుగా గుర్తించారు. యువకులు లోకేష్, సాయినాథ్, మున్నాగా తెలుస్తోంది. లక్ష్మీకాలువ నీటిని నిలిపివేసిన ఎస్సారెస్పీ అధికారులు.. గాలింపుచర్యలు కొనసాగిస్తున్నారు.