Revanth Reddy: AICC ఎన్నిక ఓటింగ్ ప్రజాస్వామ్య బద్ధంగా జరిగింది
*ఓటర్ లిస్ట్కి PCCకి సంబంధం లేదు: రేవంత్
Revanth Reddy: AICC ఎన్నిక ఓటింగ్ ప్రజాస్వామ్య బద్ధంగా జరిగింది
Revanth Reddy: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గందరగోళంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. డెలిగేట్స్ మార్పు అంశంపై అభ్యంతరాలుంటే AICCకి ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఓటర్ లిస్ట్కి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను కూడా ఓటర్ నేనన్న రేవంత్.. డెలిగేట్స లిస్ట్ అంతా అధిష్టానం ఆదేశంలో రిట్నింగ్ అధికారులిచ్చిందేనన్నారు. అయితే ఈ వ్యవహారమంతా పీఆర్వో డిపార్ట్మెంట్ వారే చూశారన్నారు. ఈ విషయంలో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. పార్టీ నేతలలో ఎవరికైనా అభ్యంతరాలుంటే ఏఐసీసీకి ఫిర్యాదు చేయవచ్చాన్నారు. ఇక కారుగుర్తు పోలిన సింబల్స్ తొలగించాలన్న వార్తలపైనా రేవంత్ స్పందించారు. ఒకప్పుడు కారు గుర్తు కూడా ఫ్రీ సింబలేనని గుర్తు చేశారు.