Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సవాల్

Revanth Reddy: ఎక్కడ ఇందిరమ్మ ఇళ్లు కట్టామో అక్కడే ఓట్లు అడుగుతాం

Update: 2023-06-23 13:43 GMT

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సవాల్ 

Revanth Reddy: కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇళ్లు కట్టామో అక్కడే తాము ఓట్లు అడుగుతామని.. ఎక్కడ మీరు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టారో అక్కడే మీరు ఓట్లు అడగండంటూ సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. అధికారంలోకి రాగానే రాష్ట్రం మొత్తం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన చోట బీఆర్ఎస్ కు డిపాజిట్ గల్లంతు అవుతాయని, అలా జరగకపోతే మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ కో ఆర్డినేటర్లు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తోటకూర జంగయ్య యాదవ్ ఇద్దరు గుండు కొట్టించుకుంటారంటూ సవాల్ విశారు. ఈ సవాలుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. ఇంటింటికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు 2 లక్షల రూపాయల రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News