Revanth Reddy: తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బంది అయింది

* ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్న రేవంత్ * హరితహారం పేరిట కేసీఆర్ ప్రభుత్వం పోడుభూములను లాక్కుంటుందని విమర్శ

Update: 2021-09-22 10:54 GMT

రేవంత్ రెడ్డి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Revanth Reddy: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఒకే కుటుంబం చేతిలో బంది అయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూడు వ్యవసాయ బిల్లులు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2006 అటవీ చట్టం తీసుకువచ్చి పోడు భూములకు కాంగ్రెస్ పట్టాలు ఇస్తే హరితహారం పేరిట కేసీఆర్ ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో ఇంతటి అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతున్న కేడీకి సీఎం మోడీ అండ ఉందని ధ్వజమెత్తారు.

Tags:    

Similar News