రంగారెడ్డి జిల్లాలో ఓ ఇంట్లో చోరీ.. 15 తులాల బంగారం, 50 తులాల వెండితో పాటు..
Rangareddy: సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
రంగారెడ్డి జిల్లా లో ఓ ఇంట్లో చోరీ.. 15 తులాల బంగారం, 50 తులాల వెండితో పాటు..
Rangareddy: రంగారెడ్డి జిల్లా మీర్పేట్లోని ఓ ఇంట్లో చోరి జరిగింది. యజమాని ఊరుకి వెళ్లి వచ్చేసరికి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు తాళాలు పగలగొట్టి 15 తులాల బంగారం, 50 తులాల వెండితో పాటు లక్ష రూపాయల నగదును దోచుకెళ్లారు. యజమాని వెంకటప్ప స్థానిక రియల్ ఎస్టేట్ సంస్థలో వ్యాపారం చేస్తున్నాడు. ఊరి నుండి వచ్చేసరికి వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో యజమాని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.