Governor Tamilisai: రాష్ట్రపతి నిలయం ప్రాంగణంలో హస్తకళల ఎగ్జిబిషన్‌ ప్రారంభించిన గవర్నర్‌

Governor Tamilisai: రాష్ట్రపతి నిలయంలో విజిటర్స్ ఫెసిలిటేషన్ సెంటర్, ఫ్లోరల్ క్లాక్‌

Update: 2024-03-06 08:17 GMT

Governor Tamilisai: రాష్ట్రపతి నిలయం ప్రాంగణంలో హస్తకళల ఎగ్జిబిషన్‌ ప్రారంభించిన గవర్నర్‌

Governor Tamilisai: తెలంగాణలోని రాష్ట్రపతి నిలయంలో విజిటర్స్ ఫెసిలిటేషన్ సెంటర్, ఫ్లోరల్ క్లాక్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రాష్ట్రపతి నిలయంలో విజిటర్స్ ఫెసిలిటేషన్‌ను ప్రారంభించిన రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలని.. విజిటర్స్ కోసం ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం రాష్ట్రపతి నిలయం ప్రాంగణంలో చేనేత హస్తకళల ఎగ్జిబిషన్‌ను గవర్నర్‌తో కలిసి ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌లో స్టాల్స్‌ను సందర్శించి కళాకారులు రూపొందించిన వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News