గత నెల 26న అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రోహిత ఆచూకీ కోసం హైదరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె ఆదివారం సికింద్రాబాద్ ప్రాంతంలో కనిపించినట్టు సమాచారం రావడంతో, రెండు బృందాలు పలు సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించాయి. అయినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటున్న రోహిత, ఆపిల్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది.
నానక్ రామ్గూడలోని ఓ అపార్ట్మెంట్లో స్నేహితులతో కలిసి ఉంటున్న ఆమె, క్రిస్మస్ మరుసటి రోజు ఇంట్లోనుంచి బయటికి వెళ్లి, మళ్లీ తిరిగి రాలేదు. సెల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడంతో, మూడు రోజుల పాటు గాలించిన తర్వాత, రోహిత సోదరుడు పరిక్షిత్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. రోహిత ఎక్కడికి వెళ్లిందన్న విషయాన్ని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.