Malla Reddy: గొర్రెలను కాసిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: గొంగడి కప్పుకుని చూపరులను ఆకట్టుకున్న మంత్రి

Update: 2023-07-06 08:22 GMT

Malla Reddy: గొర్రెలను కాసిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి గొంగడి కప్పుకుని, గొర్రెలను కాసి... చూపరులను ఆకట్టుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్... అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలానికి 15 యూనిట్లు ఇస్తున్నామని, ఒక్కో యూనిట్‌లో 21 గొర్రెలు ఉంటాయని అన్నారు. తెలంగాణ మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.

Tags:    

Similar News