Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న ఎండలు
Adilabad: ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న జనం
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి.. నిన్న మొన్నటి వరకు 35 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, జిల్లాలోని తలమడుగు, గుడిహత్నూర్ మండలాల్లో ఈరోజు 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది... ఉదయం 10 గంటల నుంచే భానుడి భగ భగలు మొదలు కాగా, మధ్యాహ్నం వేడిగాలుల తీవ్రత పెరిగి... ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు... గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.