తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి 2020 సవాళ్లేంటి.. కొత్త ఏడాదిలో కొత్త వ్యక్తిని నియమిస్తుందా?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్కు సైతం 2020 సంవత్సరం పరీక్ష పెడుతోంది. కొత్త ఏడాదిలో నాయకత్వ మార్పు ఖాయమన్న అంచనాలు ఆయనను కుదరుగా ఉండనివ్వడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురైనా, పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకున్నామని, ప్రతి అంశంపైనా ప్రజాక్షేత్రంలో పార్టీని పరుగులు పెట్టిస్తున్నానని, అధిష్టానానికి నివేదిస్తున్నారు లక్ష్మణ్. ప్రతిభకు, విధేయతకు పట్టంకట్టి, మరొక్కసారి ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఖాయమన్న అంచనాల నేపథ్యంలో, లక్ష్మణ్నే కొనసాగిస్తారా కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.