హైదరాబాద్‌లో దారుణం... చేతబడి చేశాడనే అనుమానంతో యువకుడి సజీవదహనం

- నగర శివారు శామీర్‌పేట్‌లో దారుణం - చేతబడి చేశాడన్న కారణంతో ఆంజనేయులును హత్య చేసిన గ్రామస్తులు - బుధవారం అనారోగ్యంతో గ్యార లక్ష్మీ అనే మహిళ మృతి -లక్ష్మీ చితిమంటల్లోనే యువకుడిని వేసిన గ్రామస్తులు

Update: 2019-09-19 03:55 GMT

హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని శామీర్‌పేట్‌లో ఘోరం జరిగింది. అద్రాస్‌పల్లి గ్రామంలో ఓ మహిళను చేతబడి చేశారనే కారణంతో ఆంజనేయులు అనే 24 ఏళ్ల యువకుడిని గ్రామస్తులు దారుణంగా హత్య చేశారు. అంతేకాకుండా.. ఆ మహిళ చితిలోనే యువకుడిని పడేసి సజీవదహనం చేశారు. గత ఆరేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గ్యార లక్ష్మీ అనే మహిళ నిన్న మృతిచెందింది. అయితే ఆంజనేయులు చేతబడి చేయడం వల్లే లక్ష్మీ మరణించిందని భావిస్తున్న బంధువులు, గ్రామస్తులు.. ఆంజనేయులను దారుణంగా నరికేశారు. అంతేకాకుండా.. అక్కడే కాలుతున్న లక్ష్మీ చితి మంటల్లోనే యువకుడి మృతదేహాన్ని వేసి తగులబెట్టారు. ఇటు విషయం తెలుసుకున్న శామీర్‌పేట్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Tags:    

Similar News