చిరుత సంచారంతో పరీక్షలు వాయిదా

Update: 2020-01-10 10:54 GMT
చిరుత సంచారంతో పరీక్షలు వాయిదా

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. తెలంగాణ యూనివర్శిటీలో చిరుత కన్పించిందంటూ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. యూనివర్శిటీలోని ఎంసీఏ బిల్డింగ్‌ వద్ద చిరుత కన్పించినట్లు విద్యార్థులు చెప్పడంతో ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

వర్సిటీ ఆవరణలో చిరుత పులి పాద ముద్రల కోసం ఇందల్‌వాయి అటవీ రేంజి అధికారులు, సిబ్బంది అన్వేషిస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం జరగాల్సిన పీజీ పరీక్షలను వాయిదా వేశారు. ఈ రోజు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 22వ తేదీన తిరిగి నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణాధికారి వెల్లడించారు.

Tags:    

Similar News