ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: కిషన్‌రెడ్డి

Update: 2019-06-16 12:58 GMT

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. విభజన హామీల పరిష్కారానికి నావంతు కృషి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విభజన సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్నే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారని తెలిపారు. అతి త్వరలోనే బీజేపీలోకి భారీ వలసలు కొనసాగుతాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.వచ్చే 2023లో తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టబోయేది బీజేపీయే అని కిషన్ రెడ్డి అన్నారు. 

Tags:    

Similar News