గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేది- మంత్రి వివేక్
గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేదని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేది- మంత్రి వివేక్
గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడిచేదని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో స్థానిక కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి సాండ్ బజార్ను ప్రారంభించారు మంత్రి వివేక్. గోదావరి ఇసుక కోసం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సాండ్ బజార్ను అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఈ సాండ్ బజార్ TGMDC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, గోదావరి ఇసుక కావలసిన ప్రజలు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే వస్తోందని అన్నారు. చెన్నూరులో గోదావరి నది ఉన్న ఇసుక దొరకని పరిస్థితి ఉండడంతో అధికారులతో మాట్లాడి ఈ సాండ్ బజార్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివేక్ తెలిపారు.