Telangana News: వాహనాలు సీజ్‌ చేసే అధికారం పోలీసులకు లేదు - హైకోర్టు

Telangana News: ఆర్సీ చూపిస్తే పోలీస్‌ కస్టడీ నుంచి వాహనాన్ని రిలీజ్‌ చేయాలని ఆదేశం...

Update: 2021-11-06 02:08 GMT

Telangana News: వాహనాలు సీజ్‌ చేసే అధికారం పోలీసులకు లేదు - హైకోర్టు

Telangana News: డ్రంక్ అండ్ డ్రైవ్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాహనాలు సీజ్‌ చేసే అధికారం పోలీసులకు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. తాగిన వ్యక్తి వెంట తాగని వ్యక్తి ఉంటే బండి అతనికే ఇవ్వాలని.. ఒకవేళ ఎవరూ లేకపోతే బంధువులను పిలిచి వాహనం ఇవ్వాలని కోర్టు తెలిపింది. ఆదేశాలు అమలు చేయని పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది హైకోర్టు.

కొన్ని తప్పనిసరి సందర్భాల్లో వాహనాన్ని పోలీస్‌ కస్టడీకి తీసుకోవచ్చన్న కోర్టు... ఆర్సీ చూపిస్తే పోలీస్‌ కస్టడీ నుంచి వాహనాన్ని రిలీజ్‌ చేయాలని ఆదేశం ఇచ్చింది.

Tags:    

Similar News