ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి సస్పెన్షన్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు

*హైకోర్టు ఆదేశాలతో సభకు తీసుకెళ్లనున్న అసెంబ్లీ కార్యదర్శి

Update: 2022-03-15 02:15 GMT

ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి సస్పెన్షన్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు

Telangana BJP MLA's: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ముందుకు తీసుకెళ్లాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. స్పీకర్ వాళ్ల అభ్యర్ధను వినేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సస్పెన్షన్‌పై స్పీకర్‌దే తుది నిర్ణయమని ఇవాళ ఉదయం స్పీకర్ వద్దకు వెళ్లాలని న్యాయస్థానం బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించింది. స్పీకరే సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సభలో ప్రజాప్రతినిధులు ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అసెంబ్లీ చివరి రోజైన ఇవాళ సభకు అనుమతించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. కోర్టు సూచనను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News