తెలంగాణలో జూన్‌ 8 వరకు పంట కొనుగోలు కేంద్రాలు కొనసాగింపు

Update: 2020-05-30 11:39 GMT

తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే పలు ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జూన్‌ 8 వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వర్షాలు రాకముందే రైతులు పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు.  

Tags:    

Similar News