Telangana: రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

Update: 2020-01-26 14:15 GMT

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కేకే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, నాయిని నర్సింహారెడ్డి, నామా, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు రమణ సంతోష్ రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News