తెలంగాణా గవర్నర్ నరసింహన్ కి స్వల్ప అస్వస్థత ...

Update: 2019-08-19 12:25 GMT

తెలంగాణా గవర్నర్ నరసింహన్ స్వల్ప అస్వస్థతకు గురి అయ్యారు ... అయన భార్య విమలతో కలిసి బీహార్ లోని గయ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ అనారోగ్యానికి గురయ్యారు ... అయన ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో ఆయనని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు .. ఆయనకి ప్రాధమిక చికిత్స అందించి అనంతరం రక్తపరీక్ష, ఈసీజీ పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకి ఎలాంటి సమస్య లేదని చెప్పుకొచ్చారు .. అ తరవాత నరసింహన్ అక్కడి నుండి ఢిల్లీకి వెళ్లారు . రేపు (మంగళవారం ) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. అనతరం అయన తిరిగి హైదరాబాదుకి వస్తారు .. 

Tags:    

Similar News