తెలంగాణలో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ పర్యటన

Update: 2021-01-22 08:14 GMT

తెలంగాణలో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ పర్యటన కొనసాగుతోంది. గాంధీభవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలతో మాణికం ఠాగూర్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో తర్వలో జరగనున్న పలు ఎన్నికలపై చర్చించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉపఎన్నికలపై ఈ భేటీలో చర్చకు రానుంది. కాసేపట్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి నాగార్జున సాగర్ ఉపఎన్నికలపై.. మధ్యాహ్నం 2 గంటల నుంచి వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించనున్నారు.

Tags:    

Similar News