ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందంటూసీఎం కేసీఆర్ కాన్వాయ్లోని వాహనానికి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. సీఎం కాన్వాయ్పై ఓవర్ స్పీడ్కు సంబంధించి మొత్తం నాలుగు సార్లు జరిమానా విధించారు. హైదరాబాద్లో రెండు, సైబరాబాద్లో ఒకటి, సూర్యాపేట జిల్లాలో మరో జరిమానా విధించారు. అతివేగంగా నాలుగుసార్లు వెళ్లడంతో చలానా విధించినట్టు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. దీంతో చలానా మొత్తం రూ.4,140 ను సీఎంవో అధికారులు బుధవారం చెల్లించారు.