తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళి సైతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన అనంతరం సీఎం రాజ్భవన్కు బయల్దేరి వెళ్లారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమెకు వివరించనున్నారు.