Revanth Reddy: కర్ణాటకలోని గుర్మిట్కల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం రేవంత్

Revanth Reddy: పదేళ్లలో కర్ణాటకకు మోడీ చేసింది ఏమీ లేదు

Update: 2024-04-29 10:20 GMT

 Revanth Reddy: కర్ణాటకలోని గుర్మిట్కల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం రేవంత్ 

Revanth Reddy: కర్ణాటకలోని గుర్మిట్కల్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ కర్ణాటకు ఏం చేసిందని ప్రశ్నించారు. నీటి సమస్యతో కర్ణాటక ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మోడీ కనీసం స్పందించిన పాపాన పోలేదని చెప్పారు. పదేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీని మోడీ నెరవేర్చలేదని చెప్పారు. జాతీయ స్థాయిలో పోరాడేందుకు మల్లిఖార్జున ఖర్గే బయలుదేరారని ఆయనకు కర్ణాటక ప్రజలు అండగా ఉండాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News