Revanth Reddy: ఇవాళ 4 నియోజకవర్గాల్లో తెలంగాణ సీఎం ప్రచారం

Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా సీఎం రేవంత్‌

Update: 2024-05-04 02:09 GMT

Revanth Reddy: ఇవాళ 4 నియోజకవర్గాల్లో తెలంగాణ సీఎం ప్రచారం

Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెంలో జరిగే జన జాతర సభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొత్తకోటలో జరిగే కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొంటారు. ఇక సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్‌లో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్‌లో కార్నర్ మీటింగ్‌కు హాజరై ఎంపీ అభ్యర్థుల తరపున ప్రసంగిస్తారు.

Tags:    

Similar News