రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ..దసరా సందర్భంగా కీలక నిర్ణయాలు..

Update: 2019-09-30 09:38 GMT

రేపు తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. దసరా సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. నూతన రెవెన్యూచట్టం అంశంపై రేపటి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే పలు దఫాలు సమావేశమై సూచనలు సలహాలు తీసుకున్నారు. కొత్త సచివాలయం నిర్మాణంపై సమావేశంలో చర్చించి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేయనున్నారు.

Tags:    

Similar News