కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది క్షణాల్లో ప్రమాణస్వీకారం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్భవన్ చేరుకున్నారు. వీరితో పాటు కొత్తగా ప్రమాణస్వీకారం చేయనున్న వారు కూడా రాజ్భవన్కు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై వీరిచేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు.