ఉమ్మడి నల్గొండ జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో హుజూర్నగర్ నియోజకవర్గ ఇంచార్జీ చాడ కిరణ్మయి భర్త.. కార్యర్తలపై చేయి చేసుకున్నాడు. కిరణ్మయి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారనడంతో.. కిరణ్మయి భర్త ఊగిపోయారు. ఆరోపించిన వారిపై చేయి చేసుకున్నాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.