వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
* ప్రభుత్వాసుపత్రి బాత్రూంలో ప్రసవం..శిశువు మృతి * ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లిన గర్భిణీ * వైద్యులు లేరని చెప్పిన సిబ్బంది * తీవ్ర నొప్పులతో బాత్రూంలో డెలివరీ * సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్
వికారాబాద్ జిల్లా తాండూరులో జిల్లా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువు ఊపిరి ఆగిపోయింది. డెలివరీ కోసం ఓ గర్భిణీ హాస్పిటల్కు రాగా.. డాక్టర్ అందుబాటులో లేరని చెప్పారు సిబ్బంది. దీంతో పురుటినొప్పులు పెరిగి.. ఆ గర్భిణీకి హాస్పిటల్ బాత్రూంలోనే డెలివరీ అయింది. సమయానికి చికిత్స అందక పుట్టిన శిశువు అక్కడే మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.