తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

Update: 2020-02-14 12:29 GMT
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

ప్రాచీన కట్టడాల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రాచీన కట్టడాల చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్షుడు పాశం యాదగిరి పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషనర్ తరపున న్యాయవాది నిరూప్ రెడ్డి వాదనలు వినిపించారు. చీఫ్ జస్టిస్ బాబ్డే నాయకత్వంలోని జస్టిస్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. దీనిపై విచారించిన కోర్టు ఆర్కియాలజీ, హెరిటేజ్ యాక్ట్‌లోనే కట్టడాలపై వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

Tags:    

Similar News