మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు. రామగుండంలోని ఆయన నివాసంలో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీలో అనేక మంది అవమానాలకు గురవుతున్నారని, త్వరలో వాళ్లంతా బయటికి వస్తారని సోమారపు అన్నారు. రామగుండం నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసిపోతూ.. బీజేపీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.