Nirmal: శివాలయంలో దర్శనమిచ్చిన పాము

మహా శివరాత్రి గడియల్లో.. శివాలయంలో పాము దర్శనమివ్వడం.. భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు.

Update: 2020-02-22 11:57 GMT

మహా శివరాత్రి గడియల్లో.. శివాలయంలో పాము దర్శనమివ్వడం.. భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం.. గొడిసేర్యాల గ్రామంలోని.., రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో పాము కనిపించింది.

ముందుగా ఆలయంలోని స్వామివారి విగ్రహం చుట్టూ తిరిగిన పాము.. ఆ తర్వాత పరిసరాల్లో తిరగాడింది. రాజరాజేశ్వరస్వామి వారే పాముగా దర్శనమిచ్చారని.. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఏటా ఇలా పాము దర్శనమిస్తుందని.. భక్తులు చెబుతున్నారు.


Full View


Tags:    

Similar News