రాజ్ భవన్ లో తెలంగాణ కొత్త మంత్రులుగా ఆరుగురు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెలంగాణ కొత్త మంత్రులుగా హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.