కరీంనగర్లో ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాధిక తండ్రే హంతకుడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కన్న కూతురిని తండ్రి కొమురయ్య గొంతుకోసి హత్య చేశాడు. అయితే రాధికను చంపడంలో సొంత తల్లి సహకారం ఉన్నట్లు పోలీసుల నిర్ధారణకు వచ్చారు. ఆధారాలు లేకుండా చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. జర్మనీ టెక్నాలజీతో ఆధారాలు రాబట్టారు పోలీసులు.
రాధిక హత్య కేసును ఆమె తండ్రి కొమురయ్య తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని సీపీ కమలాసన్రెడ్డి వెల్లడించారు. దిండును మొహంపై నొక్కిపెట్టి హత్య చేశాడని.. అనంతరం కత్తితో గొంతుకోశాడని తమ విచారణలో వెల్లడైనట్లు సీపీ తెలిపారు. రాధికను మర్డర్ చేసిన తర్వాత ఏమీ పట్టనట్లు తనపని తాను చేసుకుంటూ వెళ్లాడని సీపీ స్పష్టం చేశారు. కేవలం రాధిక అనారోగ్యానికి డబ్బులు ఖర్చు అవుతాయనే కూతుర్ని చంపినట్లు తెలిపారు.