Rythu Bandhu: నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల..70 లక్షల మందికి లబ్ది

Rythu Bandhu: ఒక కోటి 54 లక్షల ఎకరాలకు రైతు బంధు సాయం

Update: 2023-06-26 02:14 GMT

Rythu Bandhu: నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల..70 లక్షల మందికి లబ్ది

Rythu Bandhu: తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఇవాళ్టినుంచి పెట్టుబడి సాయాన్ని అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు.

సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలివ్వడంతోపాటు, తక్షణమే పెట్టుబడి సాయాన్ని రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని ఆదేశించారు. దీంతో ఈ సీజన్లో ప్రభుత్వంపై మరో 300 కోట్ల రూపాయలు అదనపుభారం పడింది. ఈ సారి 70 లక్షలమంది రైతులకు 72 వేల 910 కోట్లు రైతు బంధు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయబోతున్నారు. ఇవాళ్టి నుంచి ప్రాధాన్యతను బట్టి రైతు బంధు నిధులు జమచేస్తారు.

Tags:    

Similar News