పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి గాయాలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ బాలికల పాఠశాల నూతన భవనం పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ బాలికల పాఠశాల నూతన భవనం పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. క్లాస్ జరుగుతుండగా ఒక్కసారిగా పెచ్చులు ఉండటంతో ఆరో తరగతి విద్యార్థిని హర్ష తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అమెను ఆసుపత్రికి తరలించారు. 2012లో నిర్మించిన ఈ భవనం 8 ఏళ్లు పూర్తికాకముందే దెబ్బతింది. పైకప్పు దెబ్బతినడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఘటన జరిగిన సమయంలో విద్యార్థినులు భయంతో పరుగులు తీశారు.