ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు చోట్ల జరిగిన రెండు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు మరణించగా, 8మంది తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా సింగరాజుపల్లిలో రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాతపడగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, ములుగు జిల్లా మహమ్మద్గౌస్పల్లి దగ్గర ఇన్నోవా-అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.