Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Nalgonda: క్షతగాత్రులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలింపు

Update: 2023-01-08 03:18 GMT

Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం యరసానిగూడెం వద్ద డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లాకు చెందిన ఎండీ ఇద్దాక్, ఎస్‌కే సమీర్, ఎస్‌కే యాసిన్ గా గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు.

Tags:    

Similar News