Revanth Reddy: ఇవాళ మూడు నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పర్యటన
Revanth Reddy: బోథ్, నిర్మల్, జనగామ నియోజకవర్గాల్లో రేవంత్ ఎన్నికల ప్రచారం
Revanth Reddy: ఇవాళ మూడు నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పర్యటన
Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. బోథ్, నిర్మల్, జనగాం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు బోథ్ బహిరంగ సభలో పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్మల్, సాయంత్రం 4 గంటలకు జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.