కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చుతాం : రేవంత్ రెడ్డి

Revanth Reddy: విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి క్రిస్టియన్ మిషనరీలు కృషి అమోఘం : రేవంత్‌రెడ్డి

Update: 2021-12-11 15:00 GMT

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చుతాం : రేవంత్ రెడ్డి

Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దళిత క్రిస్టియన్లను ఎస్సీలలో చేర్పించేలా కృషి చేస్తామని కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి క్రిస్టియన్ మిషనరీలు ఎంతో కృషి చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. నాణ్యమైన విద్యా, వైద్యం అందించడంలోనూ క్రిస్టియన్‌ సంస్థలు బాగా పనిచేస్తున్నాయని ఆయన కొనియాడారు.

దేశంలో మత సామరస్యాన్ని కాపాడి దేశంలో ఐక్యత నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో క్రిస్మస్‌ వేడుకలను నిర్వహించారు.

Tags:    

Similar News