Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి బిజీబిజీ
Revanth Reddy: కేంద్రమంత్రి హర్దీప్సింగ్తో భేటీ అయిన రేవంత్రెడ్డి
Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి బిజీబిజీ
Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం ఏఐసీసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. అనంతరం ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతున్నారు. కేంద్ర పట్టణశాఖ మంత్రి హర్దీప్సింగ్తో భేటీ అయిన రేవంత్రెడ్డి.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కాసేపట్లో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. రాత్రి 7 గంటలకు గజేంద్రసింగ్ షెకావత్తో రేవంత్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది.