Revanth Reddy: వీహెచ్‌ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తా

Revanth Reddy: వీహెచ్‌ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

Update: 2021-06-28 09:16 GMT
వీహెచ్ హనుమంతరావును పరామర్శించిన రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Revanth Reddy: సీనియర్‌ నేత వీహెచ్‌ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. వీహెచ్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చానని...ఆయన ఆరోగ్యం కుదటపడిందని అన్నారు. హాస్పిటల్‌లో ఉన్నా.. ప్రజా సమస్యలపై తనతో చర్చించినట్లు తెలిపారు. దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్‌గా ఉన్నారన్నారు. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహంపై పోరాడాలని సూచించారని తెలిపారు. పార్టీ అభివృద్ధి విషయంలో కొన్ని సలహాలు ఇచ్చారని తెలిపారు. సోనియా గాంధీ వద్దకు స్వయంగా కలిసి వెళ్దామని చెప్పారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News